సీనియర్ నటి కవిత భర్త కన్నుమూత… !

టాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నటి ఇంట్లో కరోనా కల్లోలం సృష్టించింది. కరోనాతో మొన్న కొడుకును, ఈరోజు భర్తను పోగొట్టుకొని తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది సీనియర్ నటి కవిత. జూన్ 15వ తేదీన కోవిడ్ -19 బారిన పడి కవిత తన కుమారుడిని కోల్పోయారు. ఆమె కుమారుడు సంజయ్ రూప్ కు కొన్నిరోజుల క్రితం కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతను ఇంట్లోనే క్వారంటైన్ లో ఉన్నాడు. అయితే అతని ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తుండడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే హాస్పిటల్ లోనే అతను తుది శ్వాస విడిచారు. ఆ తర్వాత కవిత భర్త దశరథ రాజ్ కూడా కోవిడ్ -19 బారిన పడి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చాలా రోజులు కరోనాతో పోరాడిన ఆయన ఈ రోజు కన్నుమూసినట్లు తెలుస్తోంది.
అదేవిధంగా పలు తెలుగు, తమిళ సినమాల్లో సహాయక పాత్రల్లో నటించిన కవిత ప్రస్తుతం ‘ఎండ్రాండ్రం పున్నగై’ అనే టీవీ షోలో కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే 11 ఏళ్ల వయసులో సినిమా పరిశ్రమలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగు పెట్టిన కవిత.. సుమారు 350 సినిమాల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. కాగా ఇప్పుడు ఈ సీనియర్ నటి చాలా తక్కువ వ్యవధిలోనే కొడుకుని, భర్తను కోల్పోవడంతో తీవ్ర ఆవేదనకు లోనౌతుంది. కాగా దశరథ్ మరణించారన్న వార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతికి తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.