లోకేష్ కి జూనియర్ ఎన్టీఆర్ భయం పట్టుకుంది….

ఆంధ్రప్రదేశ్ టీడీపీ నేతల నారా లోకేష్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఏపీ మంత్రి పేర్నినాని. ఒక ఆడపిల్లపై జరిగిన అఘాయిత్యాన్ని కూడా రాజకీయం చేసే తుచ్ఛ సంస్కృతి లోకేష్ది అంటూ విరుచుకు పడ్డారు. అయితే ఈ సమాజంలో మృగాలు ఉన్నాయి… మేమేం చర్యలు తీసుకోకపోతే తప్పు.. కానీ.. వాళ్లని వేటాడతాం.. కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రకటించారు.. వైఎస్ జగన్ హయాంలో మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేసిన మంత్రి పేర్నినాని.. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
అదేవిధంగా పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన లోకేష్ ఇలాంటి దౌర్భాగ్య స్థితికి వెళ్లడం శోచనీయమని వ్యాఖ్యానించారు. వాళ్లకి మనోధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నాలు చేయాలి కానీ రాజకీయం చేయడం ఏమిటి.? అని ప్రశ్నించిన నాని… ఇన్ని చేస్తున్నా మనిషి ముసుగులో ఉన్న మృగాలు మానవత్వం లేకుండా విరుచుకు పడుతున్నాయని అన్నారు. లోకేష్ ఉద్యోగం ఓడిపోయిన రాజకీయ నిరుద్యోగి అని.. ఇప్పుడు ఉద్యోగం కోసం తాపత్రయపడుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు. అసలు లోకేష్ కు జూనియర్ ఎన్టీఆర్ వస్తాడేమో అనే భయం పట్టుకుందని అందుకే ఇలాంటి ఒత్తిడితో కూడిన మాటలు మాట్లాడుతున్నారని విమర్శనాస్త్రాలు సంధించారు. కాగా చుట్టూ ఉన్న 10 మందితో చప్పట్లు కొట్టించుకోవడం కాదని.. 5కోట్ల ఆంధ్రులతో చప్పట్లు కొట్టించుకోగలగాలని సూచించారు. ఈ మద్య భయపడి చచ్చే వారే ఛాలెంజ్ లు విసురుతున్నారని… లెక్కలు తీయడం మొదలెడితే కక్ష సాధింపు అంటారని.. గడ్డం పెంచిన వాడల్లా గబ్బర్ సింగ్ కాలేడని ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి పేర్ని నాని.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *