భారీగా పెరిగిన పసిడి ధరలు

ఇండియాకు పసిడికి అవినాభావ సంబంధం ఉంది. అసలు ఇండియన్స్ పసిడిని ప్రేమించినంతగా మరేదీ ప్రేమించరు అనేది వాస్తవం. అలా ఇండియాలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికి ఉండదనేది నిజం. అయితే.. కొన్ని రోజులుగా బంగారం ధరల్లో ఒడిదుడుకులు చోటు చేసుకుంటున్నాయి.
అయితే గత వారం రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న బంగారం ధర… ఈరోజు మాత్రం భారీగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు కిందికి దిగడంతో… బులియన్ మార్కెట్లోనూ దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 550 పెరిగి రూ. 48,550 కు చేరుకుంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 500 పెరిగి రూ. 44,500 కు చేరింది. ఇంకా ఈ రోజు బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలో వెండి ధర ప్రస్తుతం రూ.1900 పెరిగి రూ. 76,100 వద్ద కొనసాగుతుండటం విశేషం.