ప్రైవేటు హాస్పిటల్స్ దందా పై జగన్ సీరియస్…..

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మరోసారి సీరియస్ అయ్యారు. కరోనా సమయంలో మానవత్వం చూపాల్సిన హాస్పిటల్స్ విచ్చలవిడిగా దోచుకోవడంపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రైవేటు హాస్పిటల్స్ దందాపై సీఎం జగన్ చాలా తీవ్రంగా విరుచుకు పడ్డారు. ఆరోగ్యశ్రీ కింద ఉచిత చికిత్సల విషయంలో కృష్ణాజిల్లా అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలని, ఆస్పత్రుల్లో కచ్చితంగా 50శాతం బెడ్లు ఆరోగ్యశ్రీ పేషెంట్లుకు ఇవ్వాలని ఆయన అన్నారు. అలాగే వివిధ బీమా సంస్థల రేట్లతో పోలిస్తే.. మనం ప్రకటించిన రేట్లు కాస్త ఎక్కువగానే ఉన్నాయని, ప్రకటించిన రేట్లకు కచ్చితంగా రోగులకు సేవలు అందాలని ఆయన వివరించారు. ఇంకా ప్రైవేటు ఆస్పత్రుల్లో నియంత్రణ, నిబంధనలు కచ్చితంగా అమలు కావాలి జగన్ తెలిపారు.
అంతేకాకుండా ఆరోగ్య మిత్రలో, సీసీ కెమెరాలు సమర్థవంతగా పనిచేయాలని… ఇవి సమర్థవంతంగా పనిచేస్తే ప్రైవేటు ఆస్పత్రులమీద దాడులు చేయాల్సిన అవసరం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఇంకా దాడులు నిర్వహించిన తర్వాత అధికంగా ఛార్జీలు వసూలు చేసినందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా అవకతవకలకు పాల్పడే ప్రైవేటు హాస్పిటల్స్ పై 24 గంటల్లోగా చర్యలు తీసుకోవాలని, 24 గంటల్లో చర్యలు తీసుకోకపోతే నేరుగా తనకు నివేదిక అందాలని ఆయన వివరించారు. అదేవిధంగా కలెక్టర్లు ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *