నెక్ట్స్ షెడ్యూల్ లో గోవా ఫారెస్ట్ కి పుష్ప రాజ్..!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ గా దూసుకుపోతున్న అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే దర్శకుడు సుకుమార్ బన్నీని గతంలో ఎన్నడూ చూడని విధంగా కళ్ళు చెదిరే సన్నివేశాలను ప్లాన్ చేశారని, అందుకోసం సుకుమార్ తన క్రియేటివిటీకి పదును పెట్టారని సమాచారం అందుతుంది. అలాగే శేషాచలం అడవుల్లో జరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ మూవీ రూపొందిస్తున్నారు సుకుమార్.
అదేవిధంగా పాన్ ఇండియా సినిమాగా పలు భాషల్లో రూపొందిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ తిరిగి మొదలు కాబోతుంది.
అదేవిధంగా తర్వాతి షెడ్యూల్ ను ‘గోవా’లో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇదివరకే గోవాలో లొకేషన్స్ ఎంపిక చేసినట్లు సమాచారం. కాగా ఈ షెడ్యూల్ లో ఇంట్రడక్షన్స్ సాంగ్ ను షూటింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో మెరవబోతున్నారు. ఆయన సరసన రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో దేవి శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.