నా కుటుంబంపై పగ పట్టిన వారు త్వరలోనే బయటికి…

ఆంధ్రప్రదేశ్ లోని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి కులంపై వస్తున్న, చెలరేగుతున్న వివాదాస్పదమైన వ్యాఖ్యలపై తాజాగా ఆమె స్పందించారు. తన కులంపై కొందరు పనిగట్టుకుని ఆరోపణలు చేస్తున్నారని, రాజకీయంగా తనను ఇబ్బందులు పెట్టాలనే ప్రయత్నంలో ఉన్నారని ఆమె స్పష్టం చేశారు. అలాగే తాను ఎస్టి కొండదొర కులానికి చెందిన వ్యక్తిని అని తెలిపిన ఆమె ఎస్టి సర్టిఫికేట్ కారణంగా మా అక్క పశ్చిమ గోదావరి జిల్లాలో టీచర్ ఉద్యోగం కోల్పోయిందనేది అవాస్తవం అని ఆమె వివరిచాంరు.
అదేవిధంగా మా అక్క తులసి 2008 స్పెషల్ డిఏస్సిలో టీచర్ ఉద్యోగం వచ్చిందని.. అయితే జివో 3 ప్రకారం నాన్ లోకల్ కి ఉద్యోగాలు ఇవ్వకూడదనే రూల్ కారణంగానే ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారని ఆమె అన్నారు. 2014లో మా కుటుంబం మొత్తానికి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్టి సర్టిఫికేట్ నే ఇచ్చారని, అప్పటికి తాను రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా మా తాత గారిది శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం టిడి పారాపురం గ్రామం. అక్కడ ఎవరైనా ఎంక్వైరీ చేసుకోవచ్చని శ్రీవాణి వివరించారు. జి వో 122 ప్రకారం ఎమ్మార్వో కూడా ఎస్టి సర్టిఫికెట్ ఇవ్వొచ్చని ఎన్నికల అధికారులు ఫిర్యాదుదారులకు తెలిపారని, విచారణ రిపోర్ట్ కోసం వేచి చూస్తున్నానని వివరించారు. అలాగే తనపై కుట్రలు చేసేవారు త్వరలో బయటపడతారని పుష్పశ్రీవాణి వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *