తెలంగాణ 2021-22 బడ్జెట్ హైలెట్స్

తెలంగాణ బడ్జెట్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు ఈరోజు ప్రవేశపెట్టారు. అయితే 2020-21 ఆర్థిక సంవత్సరంలో లక్షా 82 వేల 914 కోట్ల అంచనాలతో బడ్జెట్ని ప్రవేశ పెట్టిన తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాదికి గాను బడ్జెట్ 2,30,825.96 కోట్లుగా ప్రవేశ పెట్టడం విశేషం.
ముఖ్యంగా ఏఏ రంగాలకు ఎంత బడ్జెట్ ను కేటాయించారో ఓ సారి చూద్దాం.
• రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణ కు 750 కోట్లు
• నూతన సచివాలయం నిర్మాణం కు 610 కోట్లు
• దేవాదాయ శాఖకు 720 కోట్లు
• అటవీ శాఖకు 1276 కోట్లు
• ఆర్టీసీకి 1500 కోట్లు
• ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసం 800 కోట్లు, అందుకు సంబంధించి త్వరలో మార్గదర్శకాలు వెలువడిస్తామన్నారు.
• పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు 29,271 కోట్లు
• రైతు బంధు కోసం 14,800 కోట్లు
• రైతు రుణమాఫీ కోసం 5,225 కోట్లు
• వ్యవసాయానికి 25 వేల కోట్లు
• పశుసంవర్ధక శాఖకు 1730 కోట్లు
• సాగునీటి రంగానికి 16,931 కోట్లు
• సమగ్ర భూ సర్వే కోసం 400 కోట్లు
• ఆసరా పింఛన్ల కోసం 11,728 కోట్లు
• సీఎం దళిత ఎంపవర్ మెంట్ ప్రోగ్రాం పేరుతో నూతన పథకం
• వ్యవసాయ యాంత్రీకరణకు 1500 కోట్లు
• రైతు బంధు పథకం కోసం 14800 కోట్లు
• రుణమాఫీ కోసం 5225 కోట్లు
• రైతు బీమా స్కీమ్ కు 1200 కోట్లు
• మొత్తం వ్యవసాయ రంగంలో 25 వేల కోట్లు
• పశు,మాస్థ్య శాఖకు 1730 కోట్లు
• సాగునీటి రంగానికి 16,931కోట్లు
• సమగ్ర భూ సర్వే కోసం 400 కోట్లు
• ఆసరా పెన్షన్ కోసం 11,728 కోట్లు
• కల్యాణ లక్ష్మీ/ షాది ముబారక్ 2750 కోట్లు
• అటవీ శాఖకు 1,276 కోట్లు
• అదేవిధంగా కలెక్టరేట్లు, జిల్లా పోలీసు కార్యాలయాలు, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కోసం 725 కోట్లు
• హోమ్ శాఖకు 6465 కోట్లు
• పౌరసరఫరాల శాఖకు 2363 కోట్లు
• కాళేశ్వరం టూరిజం సర్క్యూట్ పనులు ప్రారంభం
• ఎస్సీల ప్రత్యేక ప్రగతి నిధి కోసం 21,306.85 కోట్లు
• ఎస్టీల ప్రత్యేక ప్రగతి కోసం 12,304.23 కోట్లు
• నేతన్నల సంక్షేమం కోసం 338 కోట్లు.
• బీసీ సంక్షేమ శాఖకు 5522 కోట్లు
• పోలీసు స్టేషన్ లలో షి టాయిలెట్ల నిర్మాణం కోసం 20 కోట్ల రూపాయలు
• యూనివర్సిటీలలో షి టాయిలెట్స్ నిర్మాణం కోసం 10 కోట్ల రూపాయలు
• మహిళా,శిశు సంక్షేమం కోసం 1702 కోట్లు
• డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం 11 వేల కోట్లు
• పట్టణాల్లో వైకుంఠధామం నిర్మాణం కోసం 200 కోట్లు
• హైదరాబాద్ లో ఉచిత మంచినీటి సరఫరాకు 250 కోట్ల రూపాయలు
• హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం సుంకిశాల వద్ద నిర్మించే తాగునీటి ప్రాజెక్టుకు 725 కోట్లు
• మూసీ సుందరీకరణకు 200 కోట్లు
• మెట్రో రైలు ప్రాజెక్టు కోసం వెయ్యి కోట్లు
• వైద్య ఆరోగ్య శాఖకు 6295 కోట్లు
• 4 వేల కోట్లతో సరికొత్త విద్యా పథకం
• రాబోయే రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల నిర్మాణం
• పాఠశాల విద్యకి 11,735 కోట్లు
• ఉన్నత విద్యా రంగానికి 1,873కోట్లు
• ఐటీ రంగముకు 360 కోట్లు
• విద్యుత్ శాఖకు 11,046 కోట్లు
• పరిశ్రమల శాఖకు 3, 077 కోట్లు కేటాయించడం జరిగింది.