డ్రగ్స్ వాడుతూ పోలీసులకు పట్టుబడ్డ నటీమణి….

టాలీవుడ్ లో ఆది సాయికుమార్ ‘బుర్రకథ’ సినిమాతో పాటు, ఇ,ఈలో నటించిన నైరాషాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. బాయ్ ఫ్రెండ్ ఆషిక్ సాజిద్ హుస్సేన్ తో జుహూలోని ఓ స్టార్ హోటల్ లో ఆమె చరస్ ను తీసుకుంటుండగా పోలీసులు పట్టుకున్నారు.
అయితే ఆదివారం రాత్రి నైరాషా జుహూలోని ఓ స్టార్ హోటల్ లో తన పుట్టిన రోజు పార్టీని ఇచ్చిందని, అక్కడ డ్రగ్స్ వాడుతున్న సమాచారం రావడంతో పోలీసులు సోమవారం తెల్లవారుఝామున 3 గంటలకు హోటల్ గదికి వెళ్లి సోదా చేయగా దొరికిపోయారని తెలిసింది. అలాగే ఒక గ్రామ్ చరస్ ను సిగరెట్ లో చుట్టి తీసుకోవడం ఆ సమయంలో గమనించినట్లు పోలీసులు వెల్లడించారు. అదే సమయంలో నైరాషా, ఆమె స్నేహితులకు ఏదైనా డ్రగ్ రాకెట్స్ తో సంబంధం ఉందా? లేదా? అనే విషయాన్ని ఆరా తీస్తున్నట్లు ఆమెను అరెస్ట్ చేసిన శాంతక్రజ్ పోలీసులు వివరించారు.
అదేవిధంగా ఐపీసీ సెక్షన్ 274 ప్రకారం డ్రగ్స్ ను తయారు చేయడం, వాడటం, అమ్మడం, సరఫరా చేయడం, దాచడం నిషేధమని, వారి వద్ద డ్రగ్స్ లభించడంతో అదే సెక్షన్ కింద కేసు నమోదు చేశామని వెల్లడించారు. అరెస్ట్ తర్వాత కోర్టులో హాజరు చేయడానికి ముందు నైరాషా, ఆషిక్ లను వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్ కు తీసుకెళ్ళామని కూడా వివరించారు. ఆ సమయంలో నైరాషా శరీరంలో మోతాదుకు మించిన మత్తు పదార్థాలు ఉన్నాయని తెలిసిందని పోలీసులు స్పష్టం చేశారు. కాగా సోమవారం స్థానిక బాంద్రా కోర్టు నుండి నైరాషా బెయిల్ సంపాదించిందని కూడా స్పష్టం చేశారు. కాగా ఇదే సమయంలో వీరికి డ్రగ్స్ ఎలా లభ్యమయ్యిందనే దిశగా పోలీసులు విచారణ జరుపుతుండటం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *