చరణ్, శంకర్ కాంబోలో భామలిద్దరూ వీరేనా…?

సంచలనాత్మక దర్శకుడు శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో సినిమా రానున్న విషయం తెలిసిందే. ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. అయితే రాజకీయ నేపథ్యంలో రామ్ చరణ్- శంకర్ సినిమా ఉంటుందని ఇప్పటికే ప్రచారం ఊపందుకుంది. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ సినిమాపై పలు రూమర్లు హల్ చల చేస్తున్నాయి. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం నాలుగు భాషల నుంచి నలుగురు స్టార్ హీరోలను తీసుకోనున్నారని, తెలుగు వెర్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కన్నడంలో ఉపేంద్ర, తమిళంలో విజయ్ సేతుపతి, హిందీ వెర్షన్ లో సల్మాన్ ఖాన్ నటించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
అదే సమయంలో ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్ల లిస్ట్ లో ఇద్దరు స్టార్ హీరోయిన్ల పేర్లు విన్పిస్తున్నాయి. ఆ ఇద్దరూ కూడా బాలీవుడ్ భామలే అంటూ టాక్ నడుస్తోంది. మొదటగా అలియా భట్ హీరోయిన్ గా నటించనుంది అని వార్తలు వచ్చాయి. ఇప్పుడు కియారా అద్వానీ హీరోయిన్ గా నటించనుందనే టాక్ కూడా ఊపందుకుంది. మరి మెగా ఫ్యాన్స్ మాత్రం వీరిద్దరిలో ఎవరు ఓకే అయినా పర్లేదు అంటున్నారు. మరి చూద్దాం. ఎవరిని ఆ లక్ వరిస్తుందో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *