చంద్రబాబుది శవాల పై పేలాలు ఏరుకొనే రాజకీయం..

ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుపడ్డారు. ఆయన ఏమన్నారంటే… శవాలపై పేలాలు ఏరుకునేవాడిలా చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. అసలు ఆయన ఏమన్నారంటే… ‘శవాలపై పేలాలు ఏరుకునేవాడిలా నీ శవ రాజకీయాలేంటి చంద్రబాబూ? శవం దొరికితే చాలు రాబందులా వాలి రాజకీయం చేస్తున్నావు. ఇంత దరిద్రపు ప్రతిపక్షం ఎక్కడా లేదు. డాక్టర్ సుధాకర్ మృతితో ఆ కుటుంబం విషాదంలో ఉంటే నీ పాలిట్రిక్స్ ఏంటి? అంత ప్రేమున్నోడివి ఆయన ఎమ్మెల్యే టికెట్ అడిగితే ఎందుకివ్వలేదు?’ అంటూ విజయసాయిరెడ్డి చురకలు అంటించారు.
అదేవిధంగా అంతకు ముందు ట్వీట్ లో టీడీపీపై విరుచుకుపడ్డారు. ‘23వ తేదీ టీడీపీకి కాలరాత్రి. రాష్ట్రానికి పట్టిన శని వదిలిన రోజు. రెండేళ్ల క్రితం గురువారం, మే 23కే టీడీపీ అంతలా వణికింది. గోడదెబ్బ – చెంపదెబ్బ అన్నట్లుగా ఈ ఏడాది జూలై 23 శుక్రవారం వస్తోంది. ఆ రోజు పచ్చ పార్టీ పటాపంచలేనా? దేవుడు ఏం రాసిపెట్టాడో?’ అంటూ ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి. మరి విజయసాయిరెడ్డి జ్యోతిష్యం జూలై23 ఏం జరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. చూద్దాం వేచి.