కేంద్ర కేబినెట్ లోకి జ్యోతిరాదిత్య సింథియా….

కేంద్ర మంత్రివర్గంలో భారీగా మార్పులు చోటు చేసుకోనున్నాయి. తాజాగా బీజేపీలోని కీలక నేతలు ప్రధాని నివాసంలో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. దీంతో వచ్చే ఏడాది యూపీ, గుజరాత్ రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్న ఈ సమయంలో కేంద్ర మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే కేంద్ర మంత్రివర్గంలో 60 మంది కేంద్రకేబినెట్ ను 80కి పెంచే అవకాశం ఉంది. ఇప్పటికే 20 వరకు ఖాళీగా ఉన్నాయి. అందులో కీలక మంత్రులు ఒకటి కంటే ఎక్కువ శాఖలను నిర్వహిస్తున్నారు. దీంతో ఖాళీగా ఉన్న శాఖలను భర్తీ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అందులో భాగంగా మధ్యప్రదేశ్ లో కీలక నేత, బీజేపీ రాజ్యసభ ఎంపీ జ్యోతిరాదిత్య సింథియాకు కేబినెట్ లో చోటు దక్కబోతున్నట్టు సమాచారం అందుతుంది. మధ్యప్రదేశ్ లో బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు జ్యోతిరాదిత్య సింథియా కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. దీంతో సింథియాకు రాజ్యసభ ఎంపీ పదవి కూడా వరించింది. ఇక తర్వాత కేంద్ర కేబినెట్ విస్తరణలో ఆయనకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. కాగా సింథియాతో పాటుగా.. బీహార్ ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన సుశీల్ కుమార్ మోడీకి, మరికొంతమందికి కూడా కేంద్ర మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి చూడాలి. ఎవరెవరికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించనుందో