కర్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని ఆవిష్కరించిన కేటీఆర్…

తెలంగాణలోని సూర్యాపేటలో కర్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని ఆవిష్కరించారు మంత్రి కేటీఆర్. భారత్-చైనా సరిహద్దులో విధులు నిర్వహిస్తుండగా.. లద్దాఖ్లోని వాస్తవాధీన రేఖ వెంట 15 జూన్ 2020న చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీరోచితంగా పోరాటం చేసి అమరుడయ్యారు కర్నల్ సంతోష్ బాబు.
అయితే ఆయనతో పాటు మరికొందరు భారత సైనికులు ఆ ఘటనలో అమరులయ్యారు. ఆ వీరుడు నేలకొరిగి ఈరోజుకు ఏడాది గడిచింది. దీంతో.. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలో కర్నల్ సంతోష్ బాబు 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ విగ్రహాన్ని మంత్రి జగదీష్రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.