ఒడిషా సీఎంకు వైఎస్ జగన్ లేఖ…

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సముద్రంలోకి ఒక్క బొట్టు నీటిని పోనీకుండా ఎక్కడికక్కడ ప్రాజెక్టులను నిర్మించేందుకు పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపడుతున్నారు. అందులో భాగంగా ఈరోజు ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ కు ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. వంశధార నదిపై నేరడి బ్యారేజ్ నిర్మాణం విషయంలో ఒడిషా సహకారం కోరుతూ జగన్ లేఖ రాశారు.
ముఖ్యంగా నేరడి బ్యారేజీ నిర్మాణం విషయంలో ఒడిషాతో సంప్రదింపులకు సిద్దమన్న వైఎస్ జగన్ చర్చలకు ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ ను సమయం కోరారు. నేరడి బ్యారేజ్ నిర్మాణం వల్ల ఒడిషా రైతులకూ లబ్ది చేకూరుతుందని లేఖలో పేర్కొన్న జగన్ ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు, ఒడిషాలోని గజపతి జిల్లా ఉపయోగకరంగా ఉంటుందని స్పష్టం చేశారు. కాగా ఏపీ-ఒడిషా రైతులకు ఉపయోగ పడేలా నేరడి బ్యారేజ్ నిర్మాణం ఉంటుందని అభిప్రాయపడ్డ జగన్… సముద్రంలోకి వృధాగా పోయే 80 టీఎంసీల నీటిని నేరడి బ్యారేజీ నిర్మాణం ద్వారా వినియోగంలోకి తేవచ్చని పేర్కొనడం విశేషం.