ఏపీకి ప్రత్యేక హోదా పై మరో స్పష్టత..

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై కుండబద్దలు కొట్టినట్టు తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే పలు సందర్భాల్లో ఏపీ ప్రత్యేక హోదాపై క్లారిటీ ఇచ్చినప్పటికీ మరోసారి తన వైఖరిని లోక్సభలో స్పష్టం చేసింది. టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయుడు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన కేంద్ర మంత్రి నిత్యానంద్రాయ్.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చి చెప్పింది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు ఏ రాష్ట్రానికి హోదా ఇవ్వడం లేదని.. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీతో పాటు అనేక మినహాయింపులు ఇచ్చినట్టు తెలిపారు.
అదేవిధంగా తెలుగు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు ఉన్నాయని చెప్పిన నిత్యానంద్ రాయ్… ఆ సమస్యలను ఆయా తెలుగు రాష్ట్రాలే పరిష్కరించుకోవాలని సూచించారు. అలాగే మరికొన్ని విభజన హామీలు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. ఇంకా ప్రాజెక్టులు, విద్యాసంస్థల నిర్మాణం సుదీర్ఘకాలం పట్టే అవకాశం ఉందని వివరించారు. కాగా విభజన హామీ అమలు వివిధ శాఖలతో సమీక్ష చేస్తున్నామని అన్నారు. కాగా విభజన చట్టం అమలు పురోగతిని హోంశాఖ సమీక్షిస్తోందని తెలిపిన ఆయన ప్రత్యేక హోదా వంటివేమీ లేవని మరోసారి కేంద్రం తేల్చి చెప్పారు.