ఇట్స్ క్లియర్ : జూన్ 6న బీజేపీలోకి ఈటల

తెలంగాణలో రాజకీయాలు హీటెక్కాయి. అక్కడ ఈటల రాజకీయం మరింత వేడివాడిగా సాగుతుంది. ఈటల నెక్స్ట్ ఎలాంటి అడుగు వేస్తారనే విషయంపై తెలంగాణ ప్రజలు చాలా తీక్షణంగా పరిశీలిస్తున్నారు. మొన్నటి వరకు సొంత పార్టీకే ఓటు వేసిన.. ఈటల రాజేందర్ తాజాగా బీజేపీలో చేరడానికే మొగ్గు చూపుతున్నారు. ఇందుకు గాను జూన్ 6వ తేదీ ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా ప్రధాని మోడీ, అమిత్ షా, నడ్డాల అపాయింట్ మెంట్ తేదీ కోసం ఈటల ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఈటెలతో పాటు మాజీ జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశం ఉంది. బుధవారం ఉదయం నుంచి ఈటల తన నివాసంలో సన్నిహితులతో విస్తృత చర్చలు జరుపుతున్నారు. బీజేపీలో చేరికపై అందరి అభిప్రాయాలను ఈటెల తీసుకున్నారు. బీజేపీ చేరికపై ఈటెల శిబిరంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తుంది. అయితే అందరి సూచనలు ఈటెల రాజేందర్ తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2వతేదీన ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలని ఈటల సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నట్టు కూడా సమాచారం అందుతుంది. కాగా వారం రోజులుగా బీజేపీ నేతలతో జరుగుతున్న ఈటెల చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్టు ఈటల శిబిరం నుంచి తెలుస్తున్న సమాచారం. మరి ముందు ముందు ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *