ఆ సమయంలో చాలా రిస్క్ చేశాను: రాశిఖన్నా

టాలీవుడ్ గ్లామర్ డాల్ రాశి ఖన్నా ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య సరసన ‘థాంక్యూ’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి కారణంగా సినిమా షూటింగులన్నీ ఆగిపోయిన విషయం కూడా తెలిసిందే. కానీ.. ‘థాంక్యూ’ మూవీ టీమ్ మాత్రం ఇటలీ వెళ్లి షూటింగ్ కంప్లీట్ చేసుకుని రావడం విశేషం.
తాజాగా ఈ సినిమా ఇటలీ షూటింగ్ కష్టాలను చెప్పుకొచ్చింది రాశి ఖన్నా. ఆమె మాట్లాడుతూ.. కరోనా వేవ్ తాకిడి ఎక్కువ అవుతున్న సమయంలో ఇండియా నుంచి బయటకు వెళ్లాలంటే భయం వేసిందని.. ఇటలీలోను కొన్ని చోట్ల కరోనా కేసులు బయటపడడంతో మాకు అనుమతి లభించలేదని చెప్పింది. అలాగే ఆ సమయంలో తాము రిస్క్ చేసి మరీ షూటింగ్ కంప్లీట్ చేశామని తెలిపింది. అదేవిధంగా ఈ సినిమా కోసం రోజుకి 18 గంటలు కష్టపడిన సందర్భాలు కూడా ఉన్నాయని రాశిఖన్నా వివరించారు. కాగా ప్రస్తుతం ఈ అమ్మడు గోపీచంద్ సరసన ‘పక్కా కమర్షియల్’ సినిమాలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. మరి ఈ ముద్దుగుమ్మ ఈ సారి గట్టి హిట్ కొట్టాలని కోరుకుందాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *